డ్రగ్స్ కేసు : తెర మీదికి మాజీ మంత్రి కుమారుడు..?

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా డ్రగ్స్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెరమీదికి వస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటక డ్రగ్స్ కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి దివంగత జీవరాజ్ కుమారుడి పేరు తెరమీదకు వచ్చింది. మంత్రి కుమారుడు ఆదిత్య పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే గత కొంత కాలం పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆదిత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి తరహా పనులు చేస్తున్నారు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇక ఇలాగే ఊరుకుంటే దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన అధికారులు… విమానాశ్రయాలను అప్రమత్తం చేసారు. అయితే కేవలం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు కానీ ఎమర్జెన్సీ అరెస్టు సంబంధించిన నోటీసులు మాత్రం జారీ చేయలేదు అధికారులు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో 67 మంది ప్రముఖులకు నోటీసులు అందడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అరెస్టయి నవారిలో సినీ నటులు గాయకులు కూడా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news