రాయదుర్గంలో అదృశ్యమైన వ్యక్తి నల్గొండలో మర్డర్ !

-

రాయదుర్గంలో మిస్సింగ్ అయిన వ్యక్తి నల్గొండలో శవమై తేలాడు. హైదరాబాద్ రాయదుర్గం లోని మణికొండలో అదృశ్యమైన వ్యక్తి నల్గొండ లోని కృష్ణా నదిలో మర్డర్ చేసి పడేసినట్టుగా పోలీసులు తేల్చారు. రాగ్య నాయక్ అనే వ్యక్తి మణికొండలో గత కొంతకాలం తన భార్యతో పాటు ఉంటూ డ్రైవర్ పనిచేస్తూ ఉన్నాడు. ఈనెల 24 తారీఖున పనికి వెళుతున్నాను అంటూ ఇంట్లో నుంచి వెళ్ళాడు. తిరిగి రాకపోవడంతో బంధువులను, చుట్టుపక్క వాళ్ళని విచారించి భార్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

విచారణ చేపట్టిన పోలీసులు తన తోడల్లుడు లాగుపతి తో కొంతకాలం నుంచి గొడవలు ఉండటంతో ఏమన్నా చేసి ఉండవచ్చు అని భార్య అనుమానం వ్యక్తపరచడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. అనుమానితిని విచారించగా మర్డర్ చేసి కృష్ణా నదిలో పడేశామని చెప్పి ఒప్పుకోవడంతో రెండు రోజుల నుంచి రాయదుర్గం పోలీసులు నల్గొండ లో బాడీ కోసం కృష్ణా నదిలో వెతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news