మహేష్ బాబు సినిమానే రిజెక్ట్ చేసిన యంగ్ హీరోయిన్.. కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన నటనతో సూపర్ హిట్ విజయాలతో సూపర్ స్టార్ హీరోగా మారిపోయారు. ఇక మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరుశురాం దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించి మరొకసారి మహేష్ బాబును కమర్షియల్ హీరోగా నిలబెట్టింది.

ఇక ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబు సినీ కెరియర్ లోనే చిరకాలం మిగిలిపోయే ఒక అద్భుతమైన అనుభూతిని మహేష్ బాబుకు కలిగిస్తామని ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా స్పష్టం చేశాడు.

ఇక ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు సినిమాలో ఆఫర్ కోసం చాలామంది ఎగబడతారు. నిజానికి ఆయన సినిమాలో అవకాశం రావాలని చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎదురుచూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇటీవల ఒక యంగ్ హీరోయిన్ కి మాత్రం ఏరుకోరి మరీ మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తే ఆమె వద్దని చెప్పిందట. ఆమె ఎవరో కాదు ఇటీవల బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్న హీరోయిన్ శ్రీ లీల. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబుకి మరదలు పాత్రలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలకు అవకాశం ఇస్తే.. ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న నేపద్యంలో ఇలాంటి సెకండ్ హీరోయిన్ పాత్రలు ఆమె కెరియర్ కు నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆమె వద్దని చెప్పింది. కానీ శ్రీ లీల సమస్యను అర్థం చేసుకున్న త్రివిక్రమ్ ఆమె నిడివిని ఎక్కువగా చేసినట్లు సమాచారం. అయినా కూడా మహేష్ బాబు సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు ఈమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో అవకాశాలు రావడం కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించడంతో మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news