దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసిన దొంగలు

-

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి చొరబడిన దుండగులు దొరికిందంతా చోరీ చేశారు. అంతటితో ఆగకుండా ఆ ఇంట్లోని వివాహితపై భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటనతో షాక్‌లోకి జారుకున్న దంపతులు ఒక రోజంతా ఇంట్లోనే ఉండిపోయారు. నెమ్మదిగా తేరుకుని మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి సిరోహి జిల్లాలో భార్యాభర్తలు నివసిస్తున్నారు. భర్త కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. వారిని దోచుకోవాలనే ఉద్దేశంతో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే దంపతులు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా.. వారిని బంధించారు.ఈ క్రమంలోనే మహిళ భర్తపై దాడి చేసి, అతని వద్ద నుంచి రూ.1,400 లాక్కున్నారు. మరింత నగదు, విలువైన వస్తువులు అప్పగించాలంటూ బెదిరింపులకు దిగారు. అయితే, కొన్ని వెండి ఆభరణాలు తప్ప ఏం దొరకలేదు. ఈ క్రమంలోనే నలుగురూ.. భర్త ఎదుటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనతో షాక్‌లో ఉండిపోయిన దంపతులు.. గురువారం ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. శనివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు స్థానిక డీఎస్పీ జేతూ సింగ్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news