జగనన్న విద్యా కానుక.. అసలు నిజం ఇది..?

-

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులందరికీ మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా.. జగనన్న విద్యా కనుక అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల ఈ పథకం పై స్పందించిన టీడీపీ అధికార ప్రతినిధి చెంగల్రాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేవలం వైసీపీ పాలకులు ప్రచారం చేసుకోవడానికి తప్ప ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఎలాంటి మేలు జరగదు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులందరికీ ఎంత మేలు చేసింది అంటూ గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్కూల్ పిల్లలకు నాలుగు జతల యూనిఫాం లు కుట్టిస్తే.. జగనన్న విద్యా కానుక పథకం లో భాగంగా కేవలం 3 జతల యూనిఫాం కుట్టించి ఆ తర్వాత పంగనామాలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగనన్న విద్యా కానుక పథకం పై వైసీపీ బహిరంగ చర్చకు వస్తే… అప్పుడు ఆ పథకం లో డొల్లతనం ఏమిటి అన్న విషయాన్ని అందరూ ముందు బయట పెడతాము అంటూ చెప్పుకొచ్చారు టిడిపి అధికార ప్రతినిధి చెంగల్రాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news