నన్ను దెబ్బతీయడానికి గూడుపుటానీ చేస్తున్నారు : రేవంత్ రెడ్డి

-

కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కొడంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.కొడంగల్లో కాంగ్రెస్ మెజార్టీని తగ్గించి తనను కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఇందుకోసం బీజేపి, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నన్ను దెబ్బతీయడానికి గూడుపుటానీ చేస్తున్నారు అని మండిపడ్డారు.దేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి’ అని శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. కొడంగల్‌లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news