బాబుని అప్పుడే చంపేసేవారు..ఎమ్మెల్యే సోదరుడు వార్నింగ్..!

-

అధికారంలోకి వచ్చాక కొందరు వైసీపీ నేతలు ఓపెన్ గానే..ప్రత్యర్ధులని నిలువరించడానికి వారిపై దాడులు చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ప్రత్యర్ధి నేతలని భయపట్టేలా మాట్లాడటం, బూతులు తిట్టడం మామూలు అయిపోయింది. ఇక వైసీపీకి ధీటుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో ఉంటే..వారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం జరిగాయి. కానీ వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు పదే పదే వాపోతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 24న రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ గదిలో ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రాప్తాడులో ఏర్పాటుకావల్సిన జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని, దీనికి ఎమ్మెల్యే తోపుదుర్తి బెదిరింపులే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సోదరుడు చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు. అలాగే తమ ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే… మొదట చంద్రబాబు కొడుకు లోకేశ్‌నే టార్గెట్‌ చేస్తామని, జాకీ పరిశ్రమ వెళ్లిపోవడాన్ని అడ్డుపెట్టుకొని తమ కుటుంబం మీద, తమ సోదరుడి మీద అనేక రకాలుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. వాటిని భరించలేకపోతున్నామని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు 2 ఎకరాల రైతు అని, తమకు 500 ఎకరాల భూమి ఉందిని, ఆయనకు వేల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా? అని సవాలు విసిరారు. ఇలా ఎమ్మెల్యే సోదరుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే సోదరుడు మనిషా? లేక పశువా? బహిరంగంగా లోకేష్ తమ టార్గెట్ అని చెబుతున్నా..పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. అయితే ఎమ్మెల్యే సోదరుడుపై చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news