చోరీకి వెళ్లిన ఇంట్లో ఉరేసుకుని దొంగ ఆత్మహత్య..!

-

ఓ దొంగ చోరీ చేయడానికి ఓ టెకీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇళ్లంతా తిరిగి ఏవైనా విలువైన వస్తువులున్నాయా అని వెతికాడు. అంతలో ఏమైందో దేవుడి గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

బెంగళూరులోని ఇందిరానగర్​లో నివాసం ఉంటున్న ఓ టెకీ కుటుంబం విదేశాలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారింట్లో దిలీప్ బహదూర్​ అనే దొంగ శుక్రవారం ఉదయం చొరబడ్డాడు. స్నానం చేసి ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయా అని వెతికాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ టెకీ కుటుంబం విదేశాల నుంచి వచ్చేసరికి దొంగ దిలీప్ దేవుడి గదిలో ఉరి వేసుకుని కనిపించాడు.

విదేశాల నుంచి తిరిగొచ్చిన కుటుంబం అపరిచిత వ్యక్తి తమ ఇంట్లో ఉరి వేసుకుని ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలు గమనించారు. ఇంటి వద్ద ఏవైనా సీసీ కెమెరాలున్నాయా అని పరిశీలించారు.

దిలీప్ మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్​ది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దిలీప్ 2006లోనే ఓ దొంగతనం కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news