కక్ష సాధింపునకు ఇది సమయం కాదు : జనసేనాని

-

కక్ష సాధింపునకు ఇది సమయం కాదని..గతంలో అలా చేశారని, మనం అలా చేయకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. తాజాగా శాసన సభ పక్ష సమావేశంలో మాట్లాడారు. పాతతరం రాజకీయాలు పోయాయి. కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో.. వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు. ప్రజలు ఏదైనా సందర్భంలో అసహనంతో ఓ మాట మాట్లాడినా భరించాలి. ఇది తప్పదు.. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.

ఐదేళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యేలతో తరుచూ సమావేశమవుతాను.. మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే.. మన గుర్తింపును తెచ్చుకోవాలి. జనం మనల్ని నమ్మబట్టే ఈ స్థాయి విజయాన్ని మనకు చేకూర్చారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో జవాబుదారితనాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. కక్ష సాధింపును తాను ఎంకరేజ్ చేయనని తెలిపారు. రిజిస్టర్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా అవతరించాం. దేశంలో ఎవ్వరికీ లేని రికార్డు వంద శాతం స్ట్రైకింగ్ రికార్డు మనకు వచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news