ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఇదే..!

-

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 11, 12 తేదీలలో ప్రధాని విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ఈనెల 11న సాయంత్రం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికిన అనంతరం తూర్పునౌకాదళ కేంద్రం ఐ ఎన్ ఎస్ చోలాలో రాత్రి బస చేస్తారు. 12వ తేదీన ఉదయం ఏయూ గ్రౌండ్స్ కు చేరుకొని పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.

ప్రధాని స్వాగత ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు విజయసాయిరెడ్డి. అలాగే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను జిల్లా అధికారులు, ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఇక కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. రూ 10.475 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మైదానంలో సుమారుగా 65 వేల నుంచి లక్ష మంది జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news