దళిత బంధుపై మరో మూడు పిటీషన్లు దాఖలు

-

దళిత బంధు పథకం అమలు పై మొదటి నుంచి గందర గోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. హుజురాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఈ పథకం అమలుకు బ్రేక్‌ పడగా… పథకాన్ని అమలు చేసే దిశగా కొంత మంది నాయకులు హై కోర్టు లో పిటీషన్లు వేస్తున్నారు. ఇక తాజాగా దళిత బంధుపై హై కోర్టు ను ఆశ్రయించారు పలువురు తెలంగాణ నేతలు.

ఈ పథకం అమలు పై హై కోర్టు లో ఏకంగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పిటీషన్ దాఖలు చేసిన వారి లో మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్, బీజేపీ నేత డా.చంద్రశేఖర్ ఉన్నారు. హుజురాబాద్ లో దళిత బంధు యధా విధిగా కొనసాగించాలని పిటీషన్ లో కోరారు నేతలు.

దళిత బందుకు తాము వ్యతిరేకం కాదని పిటీషన్‌ లో పేర్కొన్నారు పలువురు పార్టీ నేతలు. దళితుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన దళిత బంధు ను యధావిధిగా కొనసాగించాలని కోరారు పిటిషనర్లు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ , హుజరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్, పోలీస్ కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు.

Read more RELATED
Recommended to you

Latest news