త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కు కరోనా పాజిటివ్..

-

గత రెండున్నరేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టు ముట్టింది. ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి దేశాన్ని కరోనా భయపెడుతోంది. వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వైరస్ బారిన పడుతున్నారు.

తెలంగాణలో ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు కరోనా బారిన పడ్డారు. ఈరోజు బీసీసీఐ ఛీఫ్ గంగూలీ కూడా కరోనా సోకింది. తాజాగా త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఆయన గోవా ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ తరుపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్రుణమూల్ కాంగ్రెస్ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. దీంతో త్రుణమూల్ కాంగ్రెస్ నేతల్లో, కార్యకర్తల్లో ఆందోళన ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news