జగనన్న తోడు, వడ్డీ లేకుండానే వారి ఖాతాల్లో రూ.10 వేలు వేయనున్న జగన్..

-

అమరావతి : చిరు వ్యాపారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. నేడు జగనన్న తోడు పథకం కింద.. చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయం చేయనున్నారు సీఎం జగన్‌. అంటే ఈ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.. లబ్దిదారుల ఖాతాల్లో ఆన్‌లైన్ విధానంలో నిధుల జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి.

చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీ లేని రుణం ఈ పథకం కింద అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఏకంగా 5 లక్షల 10 వేల 462 మందికి లబ్ధి చేకూరనుంది. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, 16.16 కోట్ల వడ్డీ రీఇంబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం 526.62 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో ఇవాల జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news