ipl 2021 : ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ రెండు మెగా మ్యాచ్‌ లు జరుగనున్నాయి. మొదట గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు కింగ్స్‌ పంజాబ్‌ జట్లు మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోని ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే… రెండో మ్యాచ్‌ లో భాగంగా… కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ మరియు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరుగనుంది.

ఈ మ్యాచ్‌ షార్జా లోని ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ చాలా కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ కు చేరనుంది. అటు మొదటి మ్యాచ్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇవాళ్టి మ్యాచ్ లో గెలిస్తే.. పాయింట్స్‌ టేబుల్‌ లో మొదటి స్థానానికి వెళ్లనుంది. కాగా.. నిన్న బెంగళూరు రాయల్స్‌ పై సన్‌ రైజర్స్‌ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news