జనసేనకు గాజు గ్లాసు సింబల్‌ కేటాయింపుపై రేపే కీలక తీర్పు

-

వచ్చే నెల మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో జనసేన పార్టీకి సింబల్‌ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపి హైకోర్టు, రేపు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అయితే, ఎన్నికల సంఘం ఇప్పటికే గాజు గ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టింది. గాజు గ్లాసు గుర్తు తమకే వస్తుందని జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మంగళవారం దీనిపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిని పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news