సీఎం జగన్ పై దాడి.. విజయవాడ పోలీసులు కీలక ప్రకటన

-

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా సీఎం జగన్ పై దాడి చేసిన వారికి నగదు బహుమతి ప్రకటించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రజలు కూడా తోడ్పడాలని కోరారు పోలీసులు. ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరైనా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వవచ్చని సూచించారు.

ఈ కేసుకు దోహదపడే వారి సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని.. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సమాచారం ఇచ్చే వాళ్లు డీసీపీ కంచి శ్రీనివాసరావు (9490619342) లేదా ఆర్.శ్రీహరి బాబు, ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ కు (9440627089) తెలియజేయాలని కోరారు. ఆ ఆఫీస్ కి సంబంధించిన అడ్రస్  కూడా ప్రకటించారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జీ రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట, కృష్ణలంక, విజయవాడ అంటూ అడ్రస్ గురించి సమాచారం ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news