‘దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి’ :మంత్రి పొన్నం ప్రభాకర్

-

బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ,మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు.మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని.. దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

మా ప్రభుత్వాన్ని కులగొడతామంటున్నారు.. మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్పారా..? అని ఎద్దేవా చేశారు. మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చేతనైతే 10 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారు దానిపై మీరు మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news