NBK 108: హాట్ టాపిక్ గా మారిన హీరో మరియు దర్శకుడి పారితోషకం..?

-

బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలయ్య సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాదు అంతకుమించి కలెక్షన్లు కూడా వసూలు చేసింది. సంక్రాంతి సినిమాగా వచ్చిన ఈ సినిమా కొంతమేర నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతకు మంచి ప్రాఫిట్ అందించింది.. బాలకృష్ణ సినిమా చేస్తే మినిమం సక్సెస్ అనే విధంగా సినిమా ఉంటుందని ఇప్పుడు ఇండస్ట్రీలో బలమైన టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణతో నిర్మాతలు కూడా సినిమాలు చేయాలని పోటీపడుతున్నారు. ఇక ముందుగా ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం బాలయ్య బాబు దూసుకుపోతున్నారు… ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఎప్పుడు లేని విధంగా బాలయ్య బాబును ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారట డైరెక్టర్ ఒకవైపు మాస్ మరొకవైపు కామెడీ.. ఇందులో హైలెట్ కాబోతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా పారితోషకాల విషయంలో కూడా అనేక రకాల కథనాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఊహించని విధంగా ఈ సినిమాకు రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాలో ప్రాఫిట్ షేర్ అందుకునే విధంగా కూడా ముందుగానే ఒప్పందం చేసుకోవాలని అనుకున్నారట కానీ దర్శకుడు మాత్రం ఆ రిస్కు చేయడానికి ఇంతవరకు ఏ నిర్మాతకు ఒప్పుకోలేదు అందుకే ఆయన డైరెక్ట్ గా పారితోషకం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇక బాలయ్య కూడా ఈ సినిమా కోసం రూ. 20 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు.. నిర్మాతలు కూడా వారి ఇష్టప్రకారమే పారితోషకం ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news