జులై 1, సోమవారం నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం పరిసరాల్లో గుంపులు గుంపులుగా సంచరించకూడదని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

జులై 1, సోమవారం నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. జులై 1 నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ 2 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అందుకే.. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. అలాగే అక్కడ 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్టు నగర సీపీ అంజనీ కుమార్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పరిసరాల్లో 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

జులై 1 నుంచి ఆగస్టు 28 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నందున అప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం పరిసరాల్లో గుంపులు గుంపులుగా సంచరించకూడదని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆ రూట్ లో వెళ్లే వాహనదారులు వేరే రూట్ చూసుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news