అలర్ట్ : రేపు, ఎల్లుండి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

వినాయక నిమజ్జానం నేపథ్యంలో సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలుకానున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేదం కొనసాగనుంది. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లింపు చేస్తున్నారు అధికారులు.

విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచన చేశారు. అలాగే గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.

గణేష్ నిమజ్జన గూగుల్ రూట్ మ్యాప్ & ట్రాఫిక్ ఆంక్షలు

బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మమార్గ్ వినాయక విగ్రహాల తరలింపు జరుగనుంది. బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. అలాగే సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లింపు చేశారు.ఇక ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news