తెలంగాణ అటవీ శాఖలో భారీగా బదిలీలు

-

తెలంగాణ అటవీశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 17 మంది ఐఎఫ్‌ఎస్‌లు, ఎనిమిది మంది డీఎఫ్‌ఓలను బదిలీ, పోస్టింగ్‌ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, పలువురు జిల్లా అటవీశాఖ అధికారులను సైతం బదిలీ చేసింది. అరణ్య భవన్‌లో డీసీఎఫ్‌(ఐటీ)గా శ్రీలక్ష్మి నియమితులు కాగా.. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సంయుక్త కమిషనర్‌గా (డీసీఎఫ్‌) ప్రదీప్‌ కుమార్‌ను నియమించింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్ ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా ప్రవీణ, సిద్దిపేటకు డీఎఫ్ఓగా కె.శ్రీనివాస్‌, హన్మకొండ, జనగామలకు జె. వసంత, ములుగుకు కిష్టాగౌడ్, యాదాద్రి భువనగిరికు పద్మజారాణి, నిజామాబాద్‌కు వికాస్ మీనా, రంగారెడ్డికు జాదవ్ రాహుల్ కిషన్, నాగర్ కర్నూల్‌కు జి.రోహిత్‌, మంచిర్యాలకు శివ్ ఆశీష్‌ సింగ్‌, ఖమ్మంకు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సంగారెడ్డి డీఎఫ్‌ఓగా సి.శ్రీధర్ రావును నియమించింది.

అలాగే చార్మినార్‌ సర్కిల్‌‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌వోగా వి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం.అశోక్ కుమార్, ఆమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవ రావు, వికారాబాద్ డీఎఫ్ఓగా డీవీ రెడ్డి, సూర్యాపేటకు వి.సతీష్ కుమార్ నియమితులు కాగా.. సూర్యాపేట డీఎఫ్ఓ ముకుంద్ రెడ్డిని బదిలీ చేసి ఎక్సైజ్‌ శాఖలో డీసీఎఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news