తగ్గేదేలే అంటున్న టీఆర్‌ఎస్‌.. రాష్ట్రవ్యాప్తంగా సాలు మోదీ.. సంపకు మోదీ ఫ్లెక్సీలు

-

గత కొన్ని రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మొన్నటి వరకు పరోక్షంగా విమర్శలు గుప్పించికున్నా.. ఇప్పుడు ఫ్లెక్సీలతో తలపడుతున్నారు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు. అయితే.. ఇప్పటికే బీజేపీ నేతలు సాలు దొర.. సెలవు దొర అంటూ కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌ పేరుతో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం తగ్గేదేలే అన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.

సాలు మోదీ.. సంపకు మోదీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు జిల్లాల్లోనూ వెలుస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో పలువురు ఈ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంచిర్యాల జిల్లాలోనూ మోదీకి వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లాలోని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో
సాలు మోదీ.. సంపకు మోదీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news