విద్యార్థులకు అలర్ట్‌.. ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

-

టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను సోమవారం సాయంత్రం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.

TS EDCET Results 2023 [Today 4PM] - Direct Link @TSCHE

మే 18న రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించినట్టు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జి.వినీషకు తొలి ర్యాంకు సాధించగా.. హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో మెరిశారు. ఎడ్‌సెట్‌ ఫలితాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news