విద్యార్థులకు శుభవార్త.. రేపే ఫలితాలు..

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఇంటర్‌ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఫలి‌తా‌లను ఈ నెల 28న ఉదయం 11 గంట‌లకు విడు‌దల చేస్తా‌మని విద్యా‌శాఖ మంత్రి పీ సబితా ఇంద్రా‌రెడ్డి తెలి‌పారు. ఫలి‌తా‌లను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడా‌లని ఆమె సూచించారు. మొత్తం 9,07,393 మంది విద్యా‌ర్థులు ఇంటర్‌ పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యా‌రని ఆమె వెల్లడించారు.

Telangana minister Sabitha Indra Reddy asks students to prepare for SSC  exams

అందులో 4,42,767 మంది సెకం‌డి‌యర్‌ విద్యా‌ర్థులు, 4,64,626 మంది ఫస్టి‌యర్‌ విద్యా‌ర్థులు ఉన్నా‌రని పేర్కొన్నారు. వీరంతా ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యా‌ప్తంగా 1,443 కేంద్రాల్లో పరీ‌క్షలు రాశా‌రని చెప్పారు. విద్యా‌ర్థులు ఒత్తి‌డికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించ‌వ‌చ్చని మంత్రి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news