TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరికీ బెయిల్… !

-

తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఇటీవల కేసు ఏదైనా ఉంది అంటే అది TSPSC పేపర్ లీక్ అని చెప్పాలి. చాలా ఈజీగా పేపర్ లీక్ చేసేసి స్టూడెంట్స్ మనోభావాలు దెబ్బతినడానికి కారణమయ్యారు. వారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఖైదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కక్కరుగా బెయిల్ మీద విడుదలై వస్తున్నారు. మొన్ననే ఇందులో కీలకంగా ఉన్న రేణుకను బెయిల్ పై విడుదల చేయగా , తాజాగా రేణుక భర్త మరియు ఈ కేసులో A4 గా ఉన్న రెడ్యా నాయక్ మరియు A5 గా ఉన్న రాజేశ్వర్ నాయక్ లకు నాంపల్లి కోర్ట్ కొన్ని షరతులతో కూడిన బెయిలును రూ. 50 వేలు మరియు ఇద్దరు పూచీకత్తులతో మంజూరు చేసింది.

కాగా బెయిల్ పియా విడుదల అయినా ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కేసులో అరెస్ట్ అయినా 13 మంది వరకు బెయిల్ పై విడుదల అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news