వరదల ఎఫెక్ట్ : శ్రీవారి భక్తులకు మరో శుభవార్త ..

-

తిరుమల : వర్షాలు కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులు రాబోవు ఆరు నెలలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చని.. అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నాం…అందులో భక్తులు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

వరదలు వల్ల తిరుమలలో రెండు ప్రదేశాలలోనే నష్టం జరిగింది…ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. భక్తులు నిర్భయంగా తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో మరమ్మతులు పూర్తి చేశామని.. నడకదారిన తిరుమలకు వచ్చే భక్తులను అలిపిరి కాలిబాట మార్గంలో అనుమతిస్తామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం కోతకు గురైంది…మరమ్మతులు పూర్తయిన అనంతరం ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తామని.. ఈ నెల 25వ తేదీ నుంచి మళ్ళీ వర్షాలు వున్నాయన వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ఇప్పటి నుంచే అప్రమత్తం అవుతున్నామని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు అదనపు ఈవో ధర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news