టీటీడీ కీల‌క‌ నిర్ణయం: నేడు ఐదేళ్లలోపు బిడ్డలున్న వారికి..

-

తిరుమలలో చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. నేడు మాత్రం, ఏడాది వయసుకు బదులుగా, ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు స్పెషల్ దర్శనం లభించనుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు, నేడు ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించనుంది.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news