కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి టిటిడి తీపి కబురు..

-

టిటిడి ఉద్యోగులకు పాలక మండలి తీపికబురు చెప్పింది. టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్‌ తరహాలో టిటిడి కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే టిటిడి ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపిన టిటిడి పాలక మండలి.. చెన్నై, బెంగళూరు, ముంబైలో టిటిడి సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం తెలిపింది.

అలాగే అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపిన టిటిడి పాలక మండలి.. వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటిలో టిటిడి కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం`2లో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది టీటీడీ. అలాగే స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news