ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్.. వైదొలిగిన డోర్సే

-

ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి ఆ సంస్థ కో-ఫౌండర్ జాక్ డోర్సే వెంటనే వైదొలగనున్నట్టు సోమవారం ట్విట్టర్ ప్రకటించింది. అతడి స్థానంలో కంపెనీ చీఫ్‌ టెక్నికల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపింది.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలగాలని జాక్ డోర్సే నిర్ణయించుకున్నట్లు ఈరోజు తెలిపారు. తదుపరి సీఈఓగా, బోర్డు సభ్యుడిగా పరాగ్ అగర్వాల్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ నియమకం వెంటనే అమలలోకి వస్తుందని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news