హైదరాబాద్ లో రెండు మృతదేహాల కలకలం…

-

ఒక పక్క జనాలు కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న తరుణంలో కొన్ని కొన్ని చర్యలు వాళ్ళను భయపెడుతున్నాయి. రోజు రోజుకి కరోనా తీవ్రతతో ఏ వార్త వచ్చినా సరే జనం భయపడుతున్నారు. ఎక్కడ ఏ వార్త వచ్చినా సరే ఆసక్తిగా చదువుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో రెండు మృతదేహాలు జనాలను భయపెట్టాయి. హైదరాబాద్ రాచకొండ కమీషనరేట్ పరిధిలో…

రెండు శవాలు చూసి పోలీసులు కూడా కంగారు పడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గండిచెర్వు రెవెన్యూ పరిధిలో రెండు మృతదేహాలను దుండగులు తీసుకొచ్చి పడేసారు. ఆ రెండు కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. రెండు అంబులెన్స్‌లో వచ్చిన దుండగులు మృతదేహాలను కాల్చి వేసి పడేశారని పోలీసులు ప్రాధమిక విచారణలో గుర్తించారు.

అక్కడ రోడ్డు మీద ఉన్న అధికారులు వెంటనే దీన్ని గుర్తించారు. అటు వైపుగా వెళ్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పందించారు. అవి మగాళ్ళవా, స్త్రీల మృతదేహాలా అనేది స్పష్టత లేదు. దీనిపై కమీషనర్ మహేష్ భగవత్ అధికారులను అడిగి వివరాలు సేకరించారు. వాళ్ళు కరోనా రోగులు అయి ఉంటారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news