రెండు కాలేజీ బస్సులు ఢీ.. ఒకరు మృతి

-

రెండు కాలేజీ బస్సులు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బీవీ రాజు ఇ‌ని‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పికప్ చేసుకుని కాలేజీకి బయలుదేరింది.ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో అదే కళాశాలకు చెందిన మరో బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బస్సులోని డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news