తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో రెండు మండలాలు ఏర్పాటు

-

రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గత జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించి.. వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త మండలం ఏర్పాటుతో మండలాల సంఖ్య 12కు చేరనున్నది.

CM KCR set to complete record 9 years in office - Telangana Today

హనుమకొండ జిల్లాలోని రెండు గ్రామాల బదలాయింపునకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి బదిలీ చేసింది. అలాగే వేలేరు మండలం ఎర్రబల్లె గ్రామాన్ని అదే జిల్లాలోని భీమదేవరపల్లి మండలానికి బదలాయించింది. అభ్యంతరాలు, వినతులకు 15 రోజుల గడువు ఇస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news