జులై 2న తెలంగాణ జనగర్జన సభ.. పొంగులేటి చేరిక కూడా అప్పుడే : ఠాక్రే

-

కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది.

Thakre replaces Tagore as AICC Telangana incharge

105 రోజుల్లో 36 నియోజకవర్గాలలో, 600కు పైగా గ్రామాలలో పర్యటించారు. మొత్తం 1,221 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగినట్లు వెల్లడించారు. మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జులై 2న తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశానికి హాజరైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాణిక్ రావు ఠాక్రే, రోహిత్ చౌదరి, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ సహా ఇతర నేతలకు శాలువాలు కప్పారు. ఖమ్మంలో ఏ ప్రాంతంలో సభ నిర్వహించాలి, ఏ ప్రాంతంలో సభ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందనే విషయమై నేతలు చర్చించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news