కేజ్రీవాల్ కేబినెట్​లో మరో ఇద్దరికి ఛాన్స్

-

దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఆ రాష్ట్ర కేబినెట్​పై పడింది. ఈ కేసులో అరెస్టయినందున దిల్లీ ప్రభుత్వంలో కీలక మంత్రి, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్​ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలతో మంత్రివర్గంలో ఖాళీ అయిన పలు శాఖల బాధ్యతలను అప్పగించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు.

ఎమ్మెల్యేలు అతిషీ, సౌరభ్​ భరద్వాజ్​ల పేర్లను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సిఫార్సు చేస్తూ లేఖ రాశారు. వీరిద్దరిని కేబినెట్​లోకి తీసుకునేందుకు సంబంధించిన ముసాయిదాను ఇవాళ ఉదయం గవర్నర్​ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్​ల రాజీనామాలను గవర్నర్ వీకే సక్సేనా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాజీనామాలను ఆమోదించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news