APSRTC బస్సులో గొడుగు వేసుకున్న ప్రయాణికులు.. ఫోటో వైరల్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా.. జగన్‌ సర్కార్‌ కు వ్యతిరేకంగా ఏదైన సంఘటన జరిగితే.. జెట్‌ స్పీడ్‌ లో జనాల్లోకి వెళుతుంది. అయితే.. తాజాగా APSRTC బస్సులో ప్రయాణికులు.. గొడుగు వేసుకున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

విశాఖ పట్నం నుంచి సాలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన దర్శనమించింది. వర్షాలకు ఆర్టీసీ పైకప్పు నుంచి వాటర్‌ లీక్‌ అయి.. కిందికి కారుతున్నాయనే సందేశం ఇచ్చేందుకు ప్రయాణికులు ఇలా చేశారు.

దీంతో ఆ ఫోటో వైరల్‌ అయింది. ఇక దీనిపై ఏపీకి చెందిన జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌ చేశారు. ఆకాశానికి చిల్లు.. ఆర్టీసీ బస్సుకూ చిల్లు.. ఈ పాలనలో.. సగటు బతుకుకూ చిల్లే! అంటూ సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news