ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

-

UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సమాజ్ వాది పార్టీ అధికారికంగా ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

సుదీర్ఘ కాలంపాటు ప్రజా జీవితం లో ఉన్న నాయకులు ములాయం..ఆయన మరణం బడుగు బలహీన వర్గాలు ప్రజలకు తీరని లోటు ..ఆయన ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు మోడీ.

అటు సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. నేతాజీ గా అందరి చేత పిలువబడ్డారని.. జాతీయ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news