రాష్ట్రాలతో కేంద్రం కీలక చర్చలు… ఏపీతో కూడా…!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా పలు రాష్టల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమావేశం నిర్వహిస్తున్నారు. 3 గంటలకు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, గుజరాత్, రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో సమావేశం నిర్వహిస్తారు.

రాష్టలలో కోవిడ్ పరిస్థితులు కరోనా కట్టడి అంశాలు, వాక్సినేషన్ ప్రక్రియ అంశాల పై చర్చ జరుపుతారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా నేడు హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ లో ఆయన వాక్సిన్ ప్రక్రియతో పాటుగా పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news