అరవింద్ కు పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది – కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

-

బిజెపి ఎంపీ ధర్మపురి ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కేసీఆర్, కేటీఆర్ నిరాశలో ఉన్నారని.. అందుకే మా ఎంపీ ఇంటి పై దాడి చేసారని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది గుండా ఇజం అని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు బీజేపీ కి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. గుండాగిరితో ప్రజాప్రతినిధులను భయపెడుతున్నారని మండిపడ్డారు.

అరవింద్ కు పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దాడి పై మేము కేసు పెడతాం..కోర్ట్ కు పోతామన్నారు. కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండరని .. కేవలం అండర్ గ్రౌండ్ ఛీఫ్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన , అవినీతి తో కేసీఆర్ రాజ్యమేలుతున్నాడని.. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కొంతమంది మాత్రమే ధనవంతులు అయ్యారని.. కేసీఆర్ కుటుంబం రిచ్ ఫ్యామిలీ అయిందన్నారు. సింగరేణి ని ప్రైవేటు పరం చేస్తున్నామని అబద్ధపు ప్రచారం చేసారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news