నన్ను చంపేస్తారనే భయంతో బతికా: వైసీపీ ఎమ్మెల్యే ఆవేద‌న‌

-

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. నాలుగో రోజూ అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో తన పట్ల దారుణంగా ప్రవర్తించారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపట్ల మార్షల్స్ వ్యవహారించిన తీరుపై ఇవాళ పెద్ద చర్చే జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో చస్తూ బతికానని.. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గంలో గెలవడం తప్పా? అని ఈ సందర్భంగా చెవిరెడ్డి ప్రశ్నించారు.

అలాగే చంద్రబాబు పాలనలో చంపేస్తారనే భయంతో బతికాను అని ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేశారు. తిరుపతిలో ధర్నా చేస్తే కడప సెంట్రల్‌ జైల్లో వేశారని.. తీవ్రవాదిని కొట్టినట్టు పోలీసులు తనను కొట్టారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. కనీసం తలనొప్పి మాత్ర కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news