టాస్ గెలిచిన‌ వెస్టిండీస్.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

-

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు టాస్ నెగ్గితే తాము తొలుత బ్యాటింగ్ చేయాలని భావించామని భారత కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ఇదిలా ఉంటే భారత జట్టులో రెండు మార్పులు జరిగాయ. చివరి టీ20లో బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చారు.

ప్ర‌స్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివం దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ జాదవ్, దీపక్ చాహర్, షమీ ఉన్నారు. ఇక విండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. వన్డే సిరీస్ లోనైనా గెలవాలని వెస్టిండీస్ కసిగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news