ప్రచారం కోసం ఊర్వశిరౌతేలా కక్కుర్తి, ఏకంగా.!!

-

బాలీవుడ్ నటి ఊర్వశిరౌతేలాకు పిచ్చి పట్టిందా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఆమె కావాలని వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎక్కడకి పోతే అక్కడకు ఫాలో అవుతూ, మీడియా అటెన్షన్ కోసం తెగ తాపత్రయ పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. దీనిపై నెటిజన్స్ అతన్ని ఫాలో అవ్వోద్దని గాట్టిగా వార్నింగ్ లు కూడా ఇచ్చారు.కాని  ఊర్వశి పంత్ ను  కెలుకుతూ, నెటిజన్స్ ను కవ్విస్తూ నిత్యం వార్తల్లో వుంటోంది. రోజుకో కొత్త రకం పోస్ట్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

 

ఇప్పుడు తాజాగా  ఇరాన్ లో జరిగిన  హిజాబ్ గోల లో ప్రాణం పోయిన అమ్మాయి ఇష్యూ తో తన పరిస్థితి పోలుస్తూ  ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో తొలుత ఇరాన్ లోని అమ్మాయి లాగానే, ఇప్పుడు భారత్ లో నా మీద కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని ఎవరూ ప్రశ్నించడం లేదు. కనీసం మహిళా సంఘాలు కూడా ఈ దాడిని అడ్డుకోవడం లేదు. నాకు స్త్రీ గా హక్కులు ఉన్నాయి. నాకు నచ్చిన చోట నచ్చిన విధంగా వుండే హక్కు వుందని తెలిపింది. మహిళలను వేదించడం ఆపాలని రాసుకోచ్చింది.

మరో పోస్ట్ లో ఇండియా లో కంటే ఆస్ట్రేలియాలో మీడియా కు ఎక్కువ స్వేచ్చ వుంది అని కొత్త వాదన తెచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆమెపై మండి పడ్డారు. పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ భారత దేశం పరువు పోయేలా చేయొద్దని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇకపై నీ ప్రచారం కోసం దేశంపై దిగజారి కామెంట్స్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని గాట్టిగా హెచ్చరించారు. నువ్వు వుండే విధానం వల్లే మిగిలిన వాళ్ళు నీకు గౌరవం ఇస్తారని మండిపడుతున్నారు. దీనికి కౌంటర్ గా మళ్లీ అమ్మడు ఏమి చేస్తుందో అని కొంత మంది వెయిట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news