దుబ్బాకలో కాంగ్రెస్ ఓటమి.. ఒప్పుకున్న ఉత్తమ్ !

-

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అదేంటంటే నిన్న రాత్రి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలోకి మారుతున్నట్టు ఒక ప్రముఖ ఛానల్ బ్రేకింగ్ ఇచ్చినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ చేశారు ప్రత్యర్థి పార్టీ వాళ్లు. ఈ నేపథ్యంలో ఫైర్ అవుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు.

ఆ కామెంట్స్ అర్థం ఏంటంటే ఇలానే కేరళలో గతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద తప్పుడు ప్రచారం చేశారని ఆ తర్వాత ఆయన గెలిచిన ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆ ప్రచారానికి కారణమైన సదరు ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడ దుబ్బాకలో కూడా కాంగ్రెస్ గెలవదు అని సంకేతాలు ఇచ్చినట్లు అయిందని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఉద్దేశ్యంతో అనకపోయినా సోషల్ మీడియాలో కొందరు ఆ ఉద్దేశం ఆపాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news