పని లేని బాబు ఫోన్ తో మాకేం పని…?

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో ఉన్నాడని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీమోహన్ ఆరోపించారు. ఏపీలో పనిలేని చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఎవరికి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా వదిలి రూంలో కూర్చుని చంద్రబాబు జూమ్ లో మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేసారు. చంద్రబాబు మానసిక బ్రాంతిలో ఫోన్ ట్యాప్ అయిందంటున్నాడని వంశీమోహన్ వ్యాఖ్యానించారు.

రమేష్ హాస్పిటల్ లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముందని ఆయన నిలదీశారు. తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రమేష్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మంచితనం కనపడలేదా ? అని ఆయన నిలదీశారు. విశాఖ యల్. జి ఫాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు, లోకేష్ లేఖలు రాయలేదా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news