డిసెంబరు నుంచి ‘వందే మెట్రో’ రయ్‌ రయ్‌

-

దేశ ప్రజలకు వేగవంతమైన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పెద్ద నగరాల నుంచి సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ మినీ వెర్షన్‌లో ‘వందే మెట్రో’లను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. వీటిపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నాటికే వందే మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

‘‘వందే భారత్‌తో పోలిస్తే.. వందే మెట్రో విభిన్నంగా ఉంటుంది. చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రోజుకు నాలుగు-ఐదు సర్వీసులు నడిపేలా దీన్ని రూపొందిస్తున్నాం. పెద్ద నగరాల నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకు ఇవి రాకపోకలు సాగిస్తాయి. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఇవి పట్టాలెక్కనున్నాయి’’ అని  అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

పెద్ద నగరాల చుట్టుపక్కల ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు సత్వరం చేరుకునేలా చేయడానికి వందే  మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారని రైల్వే మంత్రి  తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news