ఒక్క ట్వీట్ కు రూ.5 లు తీసుకునే పేటీయం బ్యాచ్ వైసీపీది : వంగలపూడి అనిత

-

ఒక్క ట్వీట్ కు రూ. 5 లు తీసుకునే పేటీయం బ్యాచ్ వైసీపీదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మహిళా రైతుల పాదయాత్రకి అడ్డంకులు సృష్టించడం సబబా? కడుపు మండి ధర్నా చేసే మహిళా రైతులను వక్రీకరించేలా మాట్లాడటమేంటి ? అని ఫైర్ అయ్యారు.
ధర్నా చేస్తున్న మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు.

వైసీపీ నాయకులు రాజధాని రైతులను నోటికొచ్చినట్లు దుర్భాషలాడినా సహించారని పేర్కొన్నారు. శాంతియుతంగా వెళ్తున్న రైతుల్ని రెచ్చగొట్టడం క్షమార్హం కాదని.. నిరసన తెలియజేసినవారికి మద్దతు తెలిపే హక్కును కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు.

రైతులకు మద్దతిస్తున్న న్యాయస్థానాలకు సలామని.. వైసీపీ నాయకులకన్నా పెద్ద పెయిడ్ ఆర్టిస్టులెవరూ లేరని ఎద్దేవా చేశారు. ఈ రెండున్నరేళ్లల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పని అయిపోయిందని… ఇంకో రెండున్నర సంవత్సరాల్లో క్లోజ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వంగలపూడి అనిత. అమరావతి రాజధాని అక్కడే కొనసాగుతుందని సీఎం ఒక మాట చెబితే అందరూ హర్షిస్తారన్నారు వంగల పూడి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news