టీటీడీ కీలక నిర్ణయం: మొబైల్‌ యాప్‌లో వరలక్ష్మీ వ్రతం టికెట్లు..!

-

టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 31న నిర్వహిస్తున్న వరలక్ష్మీ వత్రం ఆన్ లైన్‌ టికెట్లను గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వర్చువల్‌ విధానంలో వరలక్ష్మీ వ్రతం జరుగుతుందని పేర్కొన్నారు. అనేక మంది భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు పోస్టల్‌ శాఖ ద్వారా పూజాసామగ్రిని పంపిణీ చేశామన్నారు.

వీటిని పంపిణీ చేసే బాధ్యత పోస్టల్‌ శాఖకు అప్పగించారు. ఈనెల 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం  12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. వరలక్ష్మీవ్రతం టికెట్లు పొందిన భక్తులకు అందించే ప్రసాదాలకు సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news