నిద్ర నటిస్తున్న జగన్ ని నిద్ర లేపాలి !

-

నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ని నమ్మారు కాబట్టే ప్రజలు 151 సీట్లు ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చాక అయ్యగారి బాగోతం ప్రజలకు అర్ధమైందన్న ఆయన ఆయన మాటలకు, చేతలకు పొంతనే ఉండదని అన్నారు. నోరు ఒకలా మాట్లాడితే .. కను పాపలు మరోలా నటిస్తాయని ఆయన అన్నారు. ఒక్క‌చాన్స్ ఇచ్చినందుకు ప్రజలు చెంప దెబ్బ, గోడ దెబ్బ తింటున్నారనన్న ఆయన ప్రభుత్వం చర్యలపై అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

బాధితుల బాధలను పట్టించుకోకుండా కేసులను తారుమారు‌ చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. తప్పు అనిపిస్తే ఒక దెబ్బ కొట్టడమే పోలీసులకు తెలుసన్న ఆయన పోలీసులు ఎవరూ కూడా శిరో మండనం‌‌ చేయరని అన్నారు. కానీ పోలీస్ స్టేషను లో శిరోమండనం వెనుక ఎవరి హస్తం ఉందో తీయాలని అన్నారు. ఎవరి ఫోన్ తో ఆ పని చేశారో.. ఆ పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలని అన్నారు. ప్రశ్నించిన నోరు నొక్కడమే ఈ ప్రభుత్వం విధానమని, నిద్ర నటిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ని మేల్కొనేలా అందరూ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news