వీర సింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డు బ్రేక్ అనేలా..!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తాజాగా బాలకృష్ణ తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించి మెప్పించింది. ఇందులో కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటించగా.. ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్గా నిలిచాయి. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొన్నిచోట్ల నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ కూడా కలెక్షన్లు మోత మోగించింది ఈ సినిమా.

బాలయ్య సినీ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ తో రికార్డు బ్రేక్ చేసింది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాలయ్య సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కమర్షియల్ చిత్రంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే అయితే ఆ సినిమా రికార్డులను సైతం ఈ సినిమా కొల్లగొట్టేలా కనిపిస్తోంది మొదటి రోజే రూ.30 కోట్ల మార్కు దాటేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల మేర వసూళ్లు క్రియేట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే రూ.32 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం . అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా కేవలం రూ.90 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది కాబట్టి మరో మూడు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి బరిలో ఫలితంతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగిస్తోంది బాలయ్య సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news