బుద్ధా వెంకన్నకు వెల్లంపల్లి కౌంటర్.. సింహం వెళుతున్నప్పుడు మొరిగే కుక్క

-

టిడిపి నేత బుద్ధా వెంకన్నకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సింహం వెళుతున్నప్పుడు మొరిగే కుక్క అంటూ టిడిపి నేత బుద్ధా వెంకన్న పై విరుచుకుపడ్డారు. బుద్ధా వెంకన్న ఒక వెధవ అని.. చంద్రబాబు డైరెక్షన్లో నా మీద ఆరోపణలని మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలని.. మచ్చ లేకుండా పనులు చేస్తున్నానన్నారు.

తెలంగాణ నుంచి ఆంధ్రా కు రావటానికి పవన్ కళ్యాణ్‌కు నెల రోజులు పట్టిందని.. అటువంటి నాయకులు రాష్ట్రానికి అవసరం లేదని చురకలు అంటించారు. మంత్రుల రాజీనామా సమాచారం నా దగ్గర లేదని.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన బాగా జరిగిందన్నారు. సీఎం సొంత అజెండా తో వెళ్ళారని టీడీపీ ప్రతిసారీ అదే ఆరోపణలు చేస్తుందని.. వాళ్ళకు వేరే పనేమీ లేకే ఈ ఆరోపణలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా ముఖ్యమంత్రి కి సొంత అజెండాలు ఏముంటాయన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news