2024లో పోటీ చేయాలంటే పవన్‌కి దమ్ము, సత్తా లేదు : వెల్లంపల్లి

-

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సోమవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీమంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కట్టు బానిసగా అమ్ముడుపోయే వ్యక్తి అని జనసైనికులు సైతం అనుకుంటున్నారు అని పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్ట్‌గా రావడానికి భయం కాబట్టి పవన్ కల్యాణ్‌ని అస్త్రంగా ఉపమోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. 2024 పోటీ చేయాలంటే పవన్ కల్యాణ్‌కి దమ్ము, సత్తా లేదని హేళన చేశారు.

TDP trying to divert public attention: Andhra minister after Lord Rama idol  vandalised at Ramateertham temple - India Today

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ… పవన్ కల్యాణ్ , చంద్రబాబు, బీజేపీ పార్టీ చట్ట పట్టాలు వేసుకొని తిరిగిన సమయంలో కూడా ప్రజలకు మంచి చేయలేదని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వలంటీర్లను అవమానపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు వెల్లంపల్లి. రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్‌కు ఉందా అని అన్నారు. జగన్ నిలబెట్టిన వ్యక్తులపై ఓడిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news